ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన 'వికసిత్ భారత్ యంగ్ పార్లమెంట్' మరియు నేషనల్ సైన్స్ డే పోటీలలో పలు విభాగాలలో విజయాలు సాధించారు.
వికసిత్ భారత్ యంగ్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో ఎస్బీఐటీ విద్యార్థి పి. హనుమయ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన వంటి అంశాలలో ఆయన ప్రతిభ కనబరిచారు. ఈ విజయంతో ఆయన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడంతో పాటు, బీహార్లోని బుద్ధగయాలో జరిగే యంగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి పోటీలలో కూడా ఎస్బీఐటీ విద్యార్థులు సత్తా చాటారు. యు. జయశ్రీ ఇంక్యూబేషన్ ఐడియాస్ విభాగంలో ద్వితీయ స్థానం, ఎం.డి. జునైద్ సిద్దిఖీ ఉపన్యాస పోటీలో ద్వితీయ స్థానం సాధించారు. ఎస్.కె. షఫీయా వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇటువంటి ఆలోచనాత్మక పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తోందని, వారి ఆసక్తిని గుర్తించి తగిన శిక్షణ అందిస్తోందని ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు విద్యా నైపుణ్యాలతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవడానికి ఈ పోటీలు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విజేతలను కళాశాల ప్రతినిధులు అభినందించారు. ఈ విజయాలు కళాశాల విద్యా ప్రమాణాలకు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

