లిక్కర్ స్కాంలో ఈడీ సైలెంట్ ఆపరేషన్ !

లిక్కర్ స్కాంలో ఈడీ సైలెంట్ ఆపరేషన్ !

లిక్కర్ స్కామ్‌లో ఈడీ సైలెంటుగా పని చేసుకుంటూ పోతోంది. డబ్బులు వందలు, వేల కోట్ల రూటింగ్ జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు సిట్ నుంచి రావడంతో ఆ దిశగా వివరాలు , ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే డిస్టిలరీల యజమానులను పిలిచి .. వాటిని కన్ఫర్మ్ చేసుకుంటోంది. లంచాలు ఇచ్చారని వారిపై పెద్దగా చర్యలు ఉండవని.. నిక్కచ్చిగా నిజాలు చెప్పి, ఆధారాలు ఇస్తే.. అసలు దొంగల్ని మాత్రం పట్టుకుంటామన్న భరోసా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో వారంతా అసలు నిజాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

మద్యం స్కాంలో డిస్టిలరీల నుంచి దోచేసిన దోపిడీతో పాటు టాక్స్‌లు కట్టకుండా అమ్మిన మద్యం, లెక్కల్లోకి రాని అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున మూటకట్టారు. వాటన్నింటినీ వివిధ రకాలుగా వైట్ చేశారు. ఆ మార్గాలన్నింటినీ ఈడీ గుర్తించింది. అన్నీ రహస్యంగా చేశామని అనుకుంటున్నారు కానీ అంతా బహిరంగంగా జరిగింది. డబ్బులు చిన్న మొత్తంలో కాదు వందల కోట్లలో లావాదేవీలు జరిగాయి కాబట్టి దొరికిపోవడం సులువుగా మారుతోంది.

ఇప్పటికే లిక్కర్ స్కాంలో కీలక ఆధారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అప్రూవర్లుగా మారుతున్నారు. అసలు నిజాలు చెబుతున్నారు. ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉంది. ఈడీ ఆ పని చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పెద్ద ఎత్తున ఆస్తులను ఎటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ చర్యలు ప్రారంభిస్తే లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment