Site icon PRASHNA AYUDHAM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్ ఎన్నిక..

సిపిఎం పార్టీ

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్ ఎన్నిక..



కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం కామారెడ్డి జిల్లా మహాసభలు జిల్లా కేంద్రంలో జరిగాయి ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్ ను ఎన్నుకున్నారు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఏస్.వెంకట్ గౌడ్ ,మోతీరాం ,కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులుగా రవీందర్ ,సురేష్ గొండా, ముదాం అరుణ్, రేణుక ,ఖలీల్ ,అజయ్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version