విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి 

విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి

 

– కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్, శ్రావణ్ కుమార్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 12

 

రైతులు , వినియోగదారులు సొంతంగా విద్యుత్ కు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదని కామారెడ్డి విద్యుత్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్, శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంటికి కనపడని విద్యుత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ప్రజలకు సూచించారు. ప్రతి వైర్లలో కరెంట్ ప్రసారం అవుతుందన్న అవగాహనతో మెలగాలని అన్నారు.

తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదనీ, ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటిని గమనించిన వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి టీ జి ఎన్ పి డి సి ఎల్ టోల్ ఫ్రీ నo.1912 ద్వారా తెలియచేయగలరు. ముఖ్యంగా

ఇండ్లలో బట్టలు ఆరవేసే జి.ఐ దండెము వైర్ల వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని , తద్వారా విద్యుత్ ప్రసారం కాకుండా విద్యుత్ ప్రమాదాలను నియంత్రించవచన్నారు. అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. కనుక స్థంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

పశువుల యాజమానులు మేతకు తీసుకువెళ్ళినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు , స్థంబాలు దగ్గరికి వెళ్లకుండా కాపరి వాళ్ళు జాగ్రత్త వహించాలని కోరారు . ఒక వేళా కరెంట్ వైర్లు కింద పడి ఉంటె కాపరి వాళ్ళు గమనించి పశువులను వాటిని తాకకుండా అప్రమత్తం చేయాలనీ కోరుతున్నామన్నారు . ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి మరియు నాణ్యమైన ప్లగ్గులు, సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించండి.

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తాకి చనిపోతున్నారు.

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడం వలన షాక్ కు గురై చనిపోతున్నారు. చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరుతున్నామన్నారు.

ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే దీనికి సరియైన పరిష్కారం.

వినియోగదారుల గృహాలలోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల , నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన, రైతులు స్విచ్ బోర్డు , మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించక పోవడం వలన విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని అన్నారు . ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం నాణ్యతలేని వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున, కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు. వ్యవ సాయ పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు, ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ఎర్తింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు . రైతులు, వినియోగదారులు స్వయంగా చిన్న, పెద్ద కరెంట్ పనులను సొంతంగా చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారని, చాల బాధాకరమని , అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ తో పనులు చేసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ కంచె ల వలన రైతులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి . కావున రైతులు అప్రమతంగా ఉండాలని , ఎవరైనా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని కోరుతున్నాము .

విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం చట్ట రీత్యా నేరం అని ఆయా రైతులకు తెలుపగలరు.

విద్యుత్ సిబ్బంది చేయదగిన పనులు

ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. వ్యవసాయ మోటార్లకు, గృహాలలో నాణ్యత గల,అతుకులు ( అతుకులు ) లేని సర్వీసు వైరును మాత్రమే ఉప యోగించండి. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్ , సెక్షన్ ఆఫీసర్ లను సంప్రదించి వారి సేవలను పొందలన్నారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన టి జి ఎన్ పి డి సి ఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సంప్రదించాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment