Site icon PRASHNA AYUDHAM

ఆత్మీయ సమ్మేళనం మానసిక ఉల్లాసాన్నిస్తాయి..!!

సమ్మేళనం
Headlines:
  1. “ఆత్మీయ సమ్మేళనం: కుటుంబ సభ్యులకు మానసిక ఉల్లాసం”
  2. “గజ్వేల్‌లో వినాయక సేవా సమితి కుటుంబ సమావేశం”
  3. “గుండు కాళీ ప్రసాద్: ఆత్మీయ సమ్మేళనం కంటే మంచి అనుభూతులు”
  4. “కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెంచే ఆత్మీయ సమ్మేళనం”

సీనియర్ అడ్వకేట్ గుండు కాళీ ప్రసాద్ 

గజ్వేల్ అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో గల వినాయక సేవా సమితి సభ్యులు రిమ్మనగూడ లోని లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో గజ్వేల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ కాళీ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం లతో కుటుంబ సభ్యులకు శారీరక,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్థాయి అన్నారు. అతను మాట్లాడుతూ సభ్యుల మధ్య పరిచయాలు మెరుగవుతాయని, మధురమైన అనుభూతులు కలుగుతాయని, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుందని సభ్యుల మధ్య ఐక్యత పెరగడం వలన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని అన్నారు. రిటైర్డ్ వార్డెన్ స్వర్గం రాజేశం మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం మంచి సాంప్రదాయమని వీటిని ఇలాగే కొనసాగిస్తూ కాలనీ సభ్యులు సమస్యల పరిష్కారం లోను సమిష్టిగా రాణించాలని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపినారు ఆటలు ఆడిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకన్న వెంకట నరసింహారెడ్డి, అధ్యక్షులు మోతే వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి, కోశాధికారి అలివేలు నారాయణరెడ్డి,ఉపాధ్యక్షులు గుజ్జేటి రామచంద్రం,రేకుల అంజిరెడ్డి,సహాయ కార్యదర్శులు రేకుల అంజి రెడ్డి, వగ్గు మల్లేశం, అంకన్నగారి గోపాల్ రెడ్డి మరియు సేవాసమితి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version