*@బంజారాహిల్స్ నుండి*
*నీటిపారుదల శాఖకు ఇంజినీర్లే వెన్నుముక*
#శాఖకు పటిష్ట పరచడంలో ఇంజినీర్లు భాగస్వామ్యం కావాలి
*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
నీటిపారుదల శాఖకు ఇంజినీర్లు వెన్నెముక లాంటి వారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
సోమవారం సాయంత్రం తెలంగాణా నీటిపారుదల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రూపొందించిన 2025 క్యాలెండర్ తో పాటు డైరీని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
ఇంజనీర్ల పనితనంతోటే శాఖాపనితీరుకు గుర్తింపు వస్తుందన్నారు.
నీటిపారుదల శాఖాను పటిష్టపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు
ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నూనె శ్రీధర్,సెక్రటరీ జెనరల్ బి.గోపాలకృష్ణారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ వెగ్గలం ప్రకాష్,అసోసియేట్ ప్రెసిడెంట్ కే. సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీమహేంద్ర నాధ్,వైస్ ప్రెసిడెంట్ దొంతి కవిత లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శిలు పాల్గొన్నారు