Site icon PRASHNA AYUDHAM

ఈపి ఆపరేటర్ల పదోన్నతుల లేఖలు అందజేయాలి

IMG 20250516 WA0176

ఇతర గ్రేడ్ ల ఖాళీలు భర్తీకి చర్యలు చేపట్టాలి*
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 16 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఏరియా ఈపి ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి వినతి పత్రం అందజేశారు.ఈపి ఆపరేటర్ల పదోన్నతుల లేఖలు అందజేయాలనీ ఇతర గ్రేడ్ ల ఖాళీలు భర్తీ చేయాలనీ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నాడు మణుగూరు ఏరియా ఈ పి ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి వినతిపత్రం అందించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఈపీఆపరేటర్స్ మణుగూరు ఏరియా సమన్వయకర్త ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ స్థాయిలో మణుగూరు కొత్తగూడెం సత్తుపల్లి ఇల్లందు ఓసి గనులలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్స్ స్పెషల్ గ్రేడ్ ,ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఖాళీల భర్తీ కోసం మార్చి రెండు నుంచి ఐదు వరకు నాలుగు రోజులపాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మణుగూరులో అర్హత పరీక్షల నిర్వహించి పరీక్ష ఫలితాలు వెల్లడించారనీ ఇందుకు ఏరియా యాజమాన్యానికి ఆపరేటర్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సకాలంలో పదోన్నతుల లేఖలు అందజేస్తే ఆపరేటర్లు చాలా సంతోషిస్తారనీ అలాగే రెండు సంవత్సరాలు “డి” గ్రేడ్ లో పనిచేసిన ఆపరేటర్లకు “సి”గ్రేడ్ ఖాళీల భర్తీకి తగు చర్యలు చేపట్టవలసిందిగా మణుగూరు ఏరియా ఈ పీ ఆపరేటర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు, వీటితోపాటు ఇటీవల గ్రేడ్ టెస్ట్ పూర్తి చేసుకున్న నూట నలభై ఐదు బ్యాచ్ ఆపరేటర్లకు డి గ్రేడ్ పదోన్నతుల లేఖలు అందజేయాలని నూట నలభై నాలుగు బ్యాచ్ ఆపరేటర్లలో డిస్ క్వాలిఫైడ్ అయిన ఐదుగురికి న్యాయం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు దరిశా రమేష్, సిహెచ్ అనిల్, ఎన్ సంతోష్, జి శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version