Site icon PRASHNA AYUDHAM

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల మహేష్

IMG 20251026 184647

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షడు ఎర్రోళ్ల మహేష్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కారని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని, విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బంద్ కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ,1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య రంగ సమస్యలపై అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 30.వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బందులో విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు ప్రవీణ్,, సాయికుమార్, పవన్, నవీన్ కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version