మెచ్చ నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించిన దిశా కమిటీ సభ్యురాలు ఏసుమని

మెచ్చా నాగేశ్వరరావు
వ్యాఖ్యలను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలు యేసుమని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి మీరేం చేశారు. మేమేం చేసాము తెలుసుకోండి మా ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. నిరుపేదలకు ఉచిత విద్యుత్తు, ఉచితంగా గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ చే. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్దకు పరిపాలన కొనసాగిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మా అశ్వరావుపేట ఎమ్మెల్యే ని ఒక్కసారి మీరు పరిశీలించండి. పేదల కొరకు ఉపయోగపడుతున్నారు. ప్రజలు ఆదరిస్తున్నారు మన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ కాళ్లు చేతులను అందించారు. మారుమూల ప్రాంతాలకు సహితం సిసి రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం మీరేం చేశారు ఏం చేయలేదు కాబట్టే ప్రజలు మిమ్మలను ఓడించి ఇంటికి పంపించారు. ఇప్పుడు మరల అవకాశం ఇవ్వండి చేస్తా అంటున్నారు పది సంవత్సరాలు చేయలేనిది ఇప్పుడేం చేస్తారు అని ఎద్దేవా చేశారు.

Join WhatsApp

Join Now