*IPLలో ఆంధ్రా రొయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు?*
ఐపీఎల్లో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు.
25 ఏళ్ల ఈ యువకుడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి రొయ్యల వ్యాపారి. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణరాజు బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో రాయలసీమ కింగ్స్ తరుపున ఆడాడు. ఏడు మ్యాచ్ల్లో 6.15 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, రాజు ఆంధ్ర తరపున ఏడు మ్యాచ్ లు ఆడాడు, 26.85 సగటు, 8.23 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. 2024/25 సీజన్లో రంజీ ట్రోఫీలో ఆడాడు. ఆడిన ఆరు మ్యాచ్ లలో 30.18 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు.