ప్రతీ ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలి
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 17, కామారెడ్డి :
ప్రతీ ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతీ ఉద్యోగికి తన ఆరోగ్య పరిరక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సంయుక్తంగా గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిభిరం ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అంతకుముందు పలు పరీక్షల నిర్వహణ కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో 370 మంది ఉద్యోగులు వివిధ పరీక్షలు నిర్వహించుకున్నారు. సి.బి.పి., ఎల్.ఎఫ్.టీ., బ్లడ్ యూరియా, ఏ1సి మొదలగు పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇందులో కొంతమందికి శుక్రవారం రోజున డాక్టర్ల సూచన మేరకు లిపిడ్ ప్రొఫైల్, బి 12, థైరాయిడ్, తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, DOWA అధ్యక్షులు రాజారాం, కార్యదర్శి దయానంద్, టీ.ఎన్.జి. ఒ. అధ్యక్షులు వెంకట్ రెడ్డి, టీ.జి. ఒ. అధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, వైద్యులు డాక్టర్ పల్స హరీష్ గౌడ్, డాక్టర్ దివ్యభారతి తదితర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.