ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా వివరాలు అందించాలి..

ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా వివరాలు అందించాలి..

-సర్వే ఆధారంగా అర్హులకు సంక్షేమ పథకాలు

-మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం
నవంబర్ 11, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న సమగ్ర
కుటుంబ సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా అన్నారు. ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించి వివరాలు చెప్పాలని కోరారు. జిల్లా కేంద్రంలోని చైర్ పర్సన్ నివాసంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీపీవో గిరిధర్, ఏఈ శంకర్, ఆరో గోపాల్ రెడ్డి బృందం సోమవారం సమగ్ర సర్వే నిర్వహించగా, మున్సిపల్ చైర్ పర్సన్ పూర్తి వివరాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఇందు ప్రియా మాట్లాడుతూ.. సమగ్ర సర్వేపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ సర్వే ఆధారంగానే భవిష్యత్ లో అర్హులకు పథకాలు అందుతాయన్నారు. ప్రణా
ళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now