అల్లిపల్లి గ్రామపంచాయతీ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి కావాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి డిసెంబర్ 13

దమ్మపేట మండల పరిధిలోని అల్లిపల్లి గ్రామపంచాయతీ నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయం మరియు ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తుమ్మల మాట్లాడుతూ నా రాజకీయ అనుభవములో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని అభివృద్ధిలో ఈ జిల్లా నే అన్ని రంగాలలో రోడ్లు గాని, విద్యాలయాలు గాని, హాస్పిటల్స్ గాని, పామాయిల్ ఫ్యాక్టరీ ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దానని. ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజనులు , గిరిజనేతరులు అధికంగా ఉన్నందున వారికి ఏ ఇబ్బంది కలగకుండా. పక్షపాతం లేకుండా అధికారులు, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు సుస్థిరమైన స్థాయిలో ఆదర్శంగా అధికారులు నిలవాలని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలని. చిరస్థాయిలో అధికారిగా గుర్తుండే విధంగా ప్రజల ఆదరాభిమానాలను పొందాలని సూచించారు. అల్లిపల్లి గ్రామ ప్రజలు గ్రామాన్ని ఒకరికొకరు డబ్బులు పోగుచేసుకొని, సొంతగా నిర్మించుకున్న ఈ భవనాన్ని. ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ గ్రామాన్ని చూసి అందరూ నేర్చుకొని వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ కాశయ్య, రాష్ట్ర పామాయిల్ మాజీ చైర్మన్ ఆలపాటి రామచంద్ర ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now