*అంతా కల్తీ..*
*తూతూ మంత్రంగా తనిఖీలు*
*-ఇష్టారాజ్యంగా హోటళ్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు*
*కృష్ణాజిల్లా గుడివాడ*
ఫాస్ట్పుడ్ సెంటర్లు, హోటళ్లలో నిబంధనలు పాటించకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు – పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు..!!
రంగులు.. రుచి కోసం ఫాస్ట్పుడ్ సెంటర్లు, హోటళ్లలో నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. తినుబండారాల ఘుమఘుమల వెనుక నాసిరకం మసాలాలు, రంగులు, టేస్టింగ్ సాల్ట్, వంట నూనెలను మళ్లీ మళ్లీ వినియోగించడం, అపరిశుభ్ర నిల్వ మాంసం వినియోగంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీధి వీధినా ఫాస్ట్పుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిసినా వాటి ఆహార ప్రమాణాలు, ఇతర పర్యవేక్షణలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పెద్ద హోటళ్లు మొదలు తోపుడు బళ్ల వరకు అన్నీ కలిపి సుమారు 100. 120 వరకు ఆహార దుకాణాలున్నాయి. కానీ అనుమతి పొందిన వ్యాపారుల సంఖ్య కొద్ది మాత్రమే ఉన్నాయి. ఆహార, ఇతర తయారీదారులు, సరఫరాదారులు ఆహార నియంత్రణ పరిరక్షణ ప్రమాణాల చట్టం కిందకు వస్తారు. తోపుడు బండ్ల వ్యాపారులు కూడా కచ్చితంగా రిజిస్ట్రేషన్ పొందాల్సిందే. రూ.12 లక్షల లోపు లావాదేవీలు జరిగే వ్యాపార సంస్థ కేవలం రూ.100 చెల్లించి అనుమతులు తీసుకోవచ్చు. రూ.12 లక్షలు నుంచి రూ.20 కోట్ల వరకు లావాదేవీలు జరిపేవారు రూ.2 వేల నుంచి రూ.3 వేలతో ఏడాది లైసెన్స్ పొందాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం జిల్లా కి ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉండాలి. కానీ ఒకరు పూర్తి బాధ్యతలతో, ఒకరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో కొన్ని ఆహార నమూనాలు సేకరించాల్సి ఉండగా పూర్తిస్థాయి అధికారి ఒక్కరు మాత్రమే ఉండటంతో ఆహార నమూనాల సేకరణ తూతూమంత్రంగా సాగుతుంది. ఏడాదికి కేవలం కొద్దిపాటి ఆహార నమూనాలు సేకరిస్తున్నారు. సేకరించిన నమూనాలు పరీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రయోగశాల లేకపోవటంతో హైదరాబాద్ పంపుతున్నారు. దీంతో ఫలితాలు వచ్చే నాటికి ఆలస్యమై కేసు నీరుగారిపోతుంది.
ఇక నైనా కల్తీ ఆహార తయారీ దారులు పై అధికారులు శ్రద్ద వహించి ..ప్రజల ప్రాణాలు కాపడాల్సిందిగా కోరడం జరుగుతుంది..
ఇకనైనా అధికారులు స్పందించి హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తనిఖీ చేసి ఫుడ్ క్వాలిటీ నాణ్యతను పరీక్షించి నాణ్యత లేని వాటి పైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు..