సంబంధిత అధికారులు ఉన్న లేనట్టేనా ?
రెవెన్యూ ఫారెస్ట్ శాఖలు మండలంలో ఉన్నట్ల ! లేనట్లా ?
పిసా చట్టాన్ని సైతం గౌరవించని స్మగ్లర్లు
ముడుపులతో అధికారులు సైతం కొనేస్తామంటున్న వ్యాపారస్తులు
చట్టాలన్నీ మా చుట్టాలే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్న వైనం
అధికారులు కూడా మా వాళ్లే అంటూ అక్రమాలకు పాల్పడుతున్న వైనం
పేదవాడికి ఒక న్యాయం బడా బాబులకు మరో న్యాయమా !
అయ్యా జిల్లా కలెక్టర్ గారు మీరన్న స్పందించండి. గ్రామస్తులు
అశ్వారావుపేట డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పరిధిలోని ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు కలప వ్యాపారస్తులు 1/70 యాక్టును సైతం తూట్లు పొడుస్తున్నారు గ్రామాలలో ఉన్న పిసా చట్టం సభ్యులను సైతం లెక్కచేయకుండా నచ్చిన రీతిలో కలప వ్యాపారాలు కొనసాగిస్తున్న పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. యదేచ్చగా గత 15 రోజుల నుండి భారీ వాహనాలలో తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి భారీగా కలప రవాణా జరుపుతూ అధికారులకు సైతం సవాళ్లు విసురుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవని తేటతెల్లమవుతుంది నిజానికి కలప స్మగ్లర్లు అధికారులను ముడుపులతో కొనేస్తున్నామంటూ ధీమాగా చెప్పటం కొసమెరుపు ఏజెన్సీలో చట్టాలు మా చుట్టాలని దీమా వ్యక్తం చేస్తున్న పట్టించుకోవాల్సిన రెవెన్యూ ఫారెస్ట్ కనిపించిన స్పందించకపోవడం మండలంలో ఓ చర్చగా కొనసాగుతుంది పేదోడు ఇంటికి అవసరాల కోసం సొంత పొలంలోనైనా ఏదైనా ఓ చెట్టును నరకాలంటే అనుమతులు తప్పనిసరి అని ఫారెస్ట్ అధికారులు పదేపదే సంఘటనా స్థలానికి వెళ్లి అమాయకులను వేధించిన సంఘటనలు లేకపోలేదు నిజానికి సొంత భూమిలో ఏదైనా ఒక వృక్షం గాని ఉన్న వాటిని నరకాలి అన్న ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమే ఇటువంటి ప్రాంతంలో గత రెండు నెలల నుండి వ్యవసాయం పేరుతో మామిడి జీడి మామిడి వంటి వృక్షాలను నరికించి ఆంధ్ర వంట చెరుకు ఉపయోగిస్తున్నారు ఇటువంటి ముందుగా రెవెన్యూ శాఖ అనుమతులు తప్పనిసరి తరలించే సమయాన ఫారెస్ట్ అనుమతులు కూడా తప్పనిసరి కానీ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో కొందరు భారీ వాహనాలతో అశ్వరావుపేట పట్టణం నుండి యదేచుగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం రాజమండ్రి వంటి ప్రాంతాలకు జీడి మామిడి మామిడి వంటి వృక్షాలను తరలిస్తున్న అధికారులకు కనిపించిన అంటి అంటున్నట్లుగా ముట్టిముట్టినట్లుగా కనిపించిన కనిపించని నట్లుగా నడుచుకుంటూ గ్రామంలో అవినీతి మాయమంటూ ప్రచారాలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి ఇటువంటి వాటిని అరికట్టే పరిస్థితి లేదని సామాన్యుడికి ఒక న్యాయం బడా బాబులకు న్యాయం అంటూ అధికారులను సైతం ప్రశ్నించే స్థాయికి చేరుకుంటున్నారు జిల్లా కలెక్టర్ స్పందించాలంటూ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇటి విషయంపై ఫారెస్ట్ డిఎఫ్ఓ మురళిని చరవాణి ద్వారా వివరణ కోరగా ఇటువంటి విషయాలు మా దృష్టికి రాలేదని తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ఫారెస్ట్ కి సంబంధించిన విషయమా లేక రెవెన్యూ కి సంబంధించిన విషయమా తెలియజేస్తామని తెలపడం జరిగింది.