ప్రశ్న ఆయుధం, 29 నవంబర్, కామారెడ్డి జిల్లా: గాంధారి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మండలంలోని నామినేషన్ కేంద్రాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు. ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పోలీసులు సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.
గాంధారి మండలం నామినేషన్ కేంద్రాల పరిశీలన
Published On: November 30, 2025 7:52 pm