Site icon PRASHNA AYUDHAM

శ్రీరామ్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలన

IMG 20250901 WA0014

శ్రీరామ్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలన

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1

నాగారం మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాఘవేంద్రరావు, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మద్దిరెడ్డి రాజిరెడ్డి, మామిడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను నేరుగా నాయకులకు తెలియజేసిన స్థానికులకు తక్షణ పరిష్కారం చూపుతామని నేతలు భరోసా ఇచ్చారు.

Exit mobile version