ఏడు కోట్ల, 98 లక్షల విలువగల మత్తుపదర్థాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

ఏడు కోట్ల, 98 లక్షల విలువగల మత్తుపదర్థాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ , ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని వివిధ స్టేషన్స్ లో ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం నమోదైన (71) కేసుల్లో నిషేదిత మత్తు పదార్ధాలు అయినటువంటి గంజాయి, ఆల్ఫాజోలం, డైజోఫామ్, గంజాయి మొక్కలు జక్రాన్ పల్లి మండలం పడక్కల్ గ్రామంలో గల మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు తెలిపారు.

IMG 20250106 WA00341

నిషేదిత మత్తు పదార్థాల్లో (1285.25) కేజీల ఎండు గంజాయి, (32.585) కేజీల ఆల్ఫాజోలం, (71.845) కేజీల డైజోఫామ్ (114) గంజాయి మొక్కలు ధ్వంసం చేయడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారుగా అక్షరాల ఏడు కోట్ల, తొంబై ఎనిమిది లక్షల, డెబ్బై వేల రెండు వందల యాభై రూపాయలు (రూ. 7,98,70,250 ) ఉంటుందని కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, మధుసూదన్ రావ్, షాకీర్ హైమద్, సత్యనారాయణ, ఎస్సై విక్రమ్ కుమార్, నగేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now