నామినేటెడ్ పదవుల పైన కసరత్తు పూర్తి..
తొలి దశలో రెండు విభాగాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన చోట్ల…త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత దక్కనుంది, అలేగా బీసీ వర్గాలకు చెందిన కార్పోరేషన్లు, ఫెడరేషన్ల పాలన మండళ్ల నియామకాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటిలో కొన్ని పదవులు జనసేన,బీజేపీ నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో, వచ్చే నెల రెండో వారంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.