గల్ఫ్ కార్మికులకు ఎక్స్గ్రేషియా.. సీఎం రేవంత్ ఆదేశాలు
Mar 01, 2025,
గల్ఫ్ కార్మికులకు ఎక్స్గ్రేషియా.. సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ : గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రూ.5 లక్షల చొప్పున.. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తక్షణమే నిధుల విడుదలకు ఉత్తర్వులిచ్చారు.