క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి పై నిపుణులు, సైoటిస్టులతో పరిశీలన జరిపించాలి

క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి పై నిపుణులు, సైoటిస్టులతో పరిశీలన జరిపించాలి

సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

క్యాన్సర్ వ్యాదికి కారణాలు తెలుసుకొనుటకు నిపుణులు, సైoటిస్టులతో పరిశీలన జరిపించాలని

సిపిఐ,. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 24 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగ రేగు వలస పంచాయతీలో వైద్య సిబ్బంది వెంటనే క్యాన్సర్ వ్యాధి కి కారణాలు తెలుసుకొని వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏ ఐ కే ఎస్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు గంగారెగువలస ప్రజలతో ధర్నా నిర్వహించడం జరిగింది, అనంతరం కలెక్టరేట్ గ్రీవెన్స్ సందర్బంగా డీ ఆర్ ఓ కే. హేమలత కి మెమోరాండం ఇవ్వడమైనది, ఈ సందర్బంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు లు మాట్లాడుతూ,,

గంగరేగు వలస పంచాయతీ పరిధిలో సుమారు 7సంవత్సరాల క్రితం స్టార్ క్రాఫ్ట్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ పురుగులు మందుల కంపెనీ నిర్మించారు, ఆ పురుగుల మందులు తయారయ్యే సందర్బంలో వాటి వ్యర్ధాలు భూములోకి వెళ్లాడముతో భూ గర్భ జలాలు విషపూరితము అవ్వడం తో గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధి ప్రభలవుతుందన్నది, ఇప్పటికే 12 మంది వరకు క్యాన్సర్ బారిన పడి మృతి

చెందారు

. మరో పదిమందికి పైగా క్యాన్సర్ వ్యాధితో రోగులు మంచాలపై ఉండే పరిస్థితి ఉన్నది,ముఖ్యంగా ఒక పంచాయతీ రెండు గ్రామాల్లో ఇంత మంది క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారో ఇప్పటికీ అర్థం కాక ప్రజలు తీవ్ర భయoదోళనతో ఉన్నారు,ఇప్పటివరకు మృతి చెందిన కుటుంబాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారు ఇప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు చేసినప్పటికీ వారి కుటుంబాల ఆర్థికంగా చిదిగిపోతున్నాయి,. లక్షలు ఖర్చుపెట్టినప్పటికీ ప్రాణం దక్కకపోవడంతో కుటుంబాల ఆర్థికంగా చిదిగిపోయి కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది,మిగిలిన అనేకమంది క్యాన్సర్ప బారిన పడి చికిత్స కోసం అప్పులు చేసుకొని ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడడం చాలా దారుణం అన్నారు.

ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కలు మాత్రం కేవలం మూడే క్యాన్సర్ రోగులు ఉన్నారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉన్నది.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేషెంట్లు లేరని చెబుతూ కాలయాపన చేసి ఉన్న రోగులు పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. పంచాయతీలో ఇంత మందికి క్యాన్సర్ వ్యాప్తికి గల కారణాలను ప్రభుత్వం ఇప్పటికి కనీసం గుర్తించకపోవడం చాలా దారుణం.,

పరుగుల మందుల కంపెనీని నుండి వస్తున్న దుర్వాసన ను భరించలేక పొలాలకు పనులకు రావడానికి లేబర్ రాకపోవడముతో పంట పొలాలు అలానే ఉండిపోతున్నాయి, పొలాలకు వెళ్లాలంటేనే పరుగుల మందుల కంపెనీనుండి వస్తున్న దుర్వాషనకు రైతులు భయపడిపోతున్నారు,

ఆనాడు జాoఝావతి ప్రాజెక్ట్ పనులు కోసం నిర్మించిన వర్కుషాప్ ను ఆక్రమించి అందులో పరుగుల మందుల కంపెనీ తాలూకా ముడిసరుకును యాజమాన్యం డంపింగ్ యార్డ్ గా చేసుకున్నారు,,

జిల్లా కలెక్టర్  పై విషయాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి

క్యాన్సర్ వ్యాదికి కారణమైన స్టార్ క్రాఫ్ట్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ పురుగుల మందుల కంపెనీని ముసివేయాలి,

క్యాన్సర్ వ్యాదికి కారణాలు తెలుసుకొనుటకు నిపుణులు, సైoటిస్టులతో పరిశీలన జరిపించాలి,

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాము, ఈ కార్యక్రమంలో

Join WhatsApp

Join Now

Leave a Comment