*మాదక ద్రవ్యాలు సేవించినట్లయితే కుటుంబాలు నష్టపోతాయి*
*మాదక ద్రవ్యాలపై పోలీసులచే అవగాహన సదస్సు*
*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 18 ప్రశ్న ఆయుధం*
యాంటీ నార్కోటిక్స్ మారకద్రవ్యాలపై మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సును ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మల్లయ్య కానిస్టేబుల్ శివాజీ లు అవగాహన కల్పించారు
విద్యార్థి దశ నుండే మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, సిగరెట్, మత్తుపదార్థాలు, చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉన్నత భవిష్యత్తు కల్పించుకోవడానికి విద్యార్థి దశ చాలా ముఖ్యమని డ్రగ్స్ కి బానిస అయినట్లయితే బైక్ రైడింగ్ సమయంలో యాక్సిడెంట్స్ జరగడం కుటుంబాలు నష్టపోవడం, ఆర్థికంగా వెనుక పడడం, డబ్బు సేకరించడానికి అనేకమైనటువంటి చీటింగ్, డబ్బు దొంగలించడం లాంటి కార్యక్రమాలు చేయడం అలవాటవుతుందని అలాగే మొబైల్, వాట్సాప్ లో లింకులను క్లిక్ చేయడం, బెట్టింగ్ ఆటలకి అలవాటు పడడం వీటన్నింటిని తగ్గించుకోవాలని మంచి మార్గంలో ఉంటూ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేటువంటి మంచి విషయాలను నేర్చుకుని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్. వేణు, కే. సత్యం, ఎం. సమ్మిరెడ్డి, కే. శంకర్, సిహెచ్. రామకృష్ణ, జీ. అన్నపూర్ణ , .ఏ సురేష్, జె. రాధిక రాణి, పరమేశ్వర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.