సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండలంలోని జిన్నారం, జంగంపేట గ్రామ రైతులు తమ భూములపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జంగంపేట, జిన్నారం గ్రామాల్లోని అసైన్ భూములను జీహెచ్ఎంసీ, టీజీఐఐసీకి అప్పగించిన తర్వాత, సంబంధిత అధికారులు రైతులకు కేవలం 600 గజాల సర్టిఫికెట్ ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపకుండా, భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ధర్నా సమయంలో రైతులు తమ సమస్యలను వివరంగా వివరించి వినతి పత్రాన్ని తహసిల్దార్కు అందజేశారు. దీనిపై తహసిల్దార్ జిహెచ్ఎంసికి సంబంధించిన భూమి సమస్యను 15 రోజుల లోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, రైతుల మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరేందర్, ఖదీర్, కృష్ణగౌడ్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, భ్రమేందర్ గౌడ్, రైతులు మల్లేష్, వెంకటేష్, విఠల్, యాదయ్య, నర్సిములు, శ్రీనివాస్, రాంచంధర్, దుర్గయ్య, మహేష్, వెంకట్ రెడ్డి, ఈశ్వరయ్య, పోచయ్య, శ్రీనివాస్, దుర్గయ్యా, రమేష్, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
Oplus_131072