రుణ మాఫీ కానీ రైతులు ఎవ్వరు ఆందోళన చెందవద్దు..
-డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం)
గాంధారి మండలం లో రుణ మాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దని రేషన్ కార్డు లేని రైతులకు కూడా కుటుంబ నిర్ధారణ చేసి అర్హులైన రైతుల వివరాలను యాప్ లో అప్లోడ్ చేస్తున్నామని ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ ప్రసన్న మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా గాంధారి మండలంలో ని పోతాంగల్ కలాన్,సర్వపూర్,రాంపూర్ గడ్డ మరియు గాంధారి గ్రామంల్లో రేషన్ కార్డ్ లేక రుణమాఫీ కానీ రైతుల యొక్క వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లో సెల్ఫీ ఫోటో దిగి వారి నుండి ధ్రువీకరణ పత్రం ను యాప్ లో పొందు పరచడం జరుగుతుందని తెలిపారు.అలాగే రాష్ట్రంలో గత 3రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవలన దెబ్బ తిన్న పంట పొలాలను సందర్శించి రైతులు అ ధైర్య పడవద్దని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ను అందచేస్తామని ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు షోయబ్ అహ్మద్ దీక్షిత్ రెడ్డి మరియు రైతులు పాల్గొనడం జరిగింది.