రైతులకు సరిపడా యూరియా అందించాలి
కామారెడ్డి జిల్లా, జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం)సెప్టెంబర్ 03
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ కేంద్రంలో రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని పెద్ద కోడప్ గల్ భారతీయ కిసాన్ సంఘం గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ పేర్కొన్నారు.మండల కేంద్రం లో రోడ్డు పై రైతులు ధర్నా చేశారు, ఈ సందర్భంగా కుమార్ సింగ్ మాట్లాడుతూ… రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం తో రైతంగం చాలా ఇబ్బంది లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా ను అందుబాటులోకి తెచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలని నాయబ్ తహశీల్దార్ రవి కాంత్ కు వినతి పత్రం ఇచ్చరూ. ఈ కార్యక్రమం లో పెద్ద కొడప్గల్ గ్రామ కిసాన్ సంఘం మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శి బోడి మల్లికార్జున్, మండల అధ్యక్షులు జైత్రం, బాన్సువాడ డివిజన్ సభ్యులు దేవి సింగ్, మొలుగు సంజీవ్ రెడ్డి,గ్రామ ఉపాధ్యక్షులు అప్రోజ్, జక్కుల అంజయ్య,రైతులు పాల్గొన్నారు.