వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
-ఎమ్మెల్యే మదన్ మోహన్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పేట్ మండలంలోని మల్తూమ్మద సొసైటీ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని రైతులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు లేకుండా రైతులకు మోసం జరగకుండా తూకం వేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్యాడి క్లీనింగ్ మిషన్ లు కొనుగోలు చేసి రైతులకు ఆసరా గా నిలుస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో లలో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతులు సంతోషంగా ఉంటే గ్రామాలు, రాష్ట్రాలు, మన దేశం సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారిపైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి, మాల్తూమ్మెద సొసైటీ ఛైర్మన్, ఎల్లారెడ్డి ఏ.ఎం.సి.
డైరెక్టర్లు నాగిరెడ్డి పెట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు, గ్రామా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.