భార్యాభర్తల మధ్య గొడవ.. కొడుకును చంపి పారిపోయిన తండ్రి
Jul 30, 2025,
ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా పదేళ్ల కుమారుడిని తండ్రి చంపేసి పారిపోయాడు. నరేలాలో నివసిస్తున్న నరేంద్రతో గొడవల కారణంగా భార్య కోమల్ విడిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తున్నది. మంగళవారం స్కూల్కు వెళ్లిన చిన్న కుమారుడిని నరేంద్ర చంపేశాడు. భార్యకు ఫోన్ చేసి పారిపోయాడు. కోమల్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.