Site icon PRASHNA AYUDHAM

భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను చంపి పారిపోయిన తండ్రి 

IMG 20250622 WA1333

భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను చంపి పారిపోయిన తండ్రి

ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అందరిని నమ్మించిన తండ్రి రవిశంకర్ కేసులో ట్విస్ట్

రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే అనుమానంతో దర్యాప్తు చేసి విశాఖలో అరెస్టు చేసిన పోలీసులు

ఈ నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించిన ఘటనలో, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రి రవిశంకర్ లేఖ రాయడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ఎంత వెతికినా రవిశంకర్ మృతదేహం లభించకపోవడంతో, అతను బ్రతికే ఉన్నాడనే అనుమానంతో బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

అతని పేరు మీదనే కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడని తెలుసుకొని లొకేషన్ ట్రేస్ చేయగా, విశాఖలో ఉన్నాడని గుర్తించి రవిశంకర్ ను అరెస్టు చేసిన పోలీసులు

భార్యపై అనుమానంతోనే పిల్లలను చంపి పారిపోయినట్టు విచారణలో అంగీకరించిన రవిశంకర్

Exit mobile version