*ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి:*
*బిఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్*.
అప్పులు చేసి కాలేజీ ఫీజులు కడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు,సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యం.
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్వీ కల్వకుర్తి తరఫున దారమోని గణేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థని నిర్వీర్యం చేసే పనిలో రేవంత్ సర్కారు ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దె విద్యా శాఖను పెట్టుకుని రాష్ట్రంలో ఐదు వేలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటినప్పటికీ ఒక రూపాయి కూడా విద్య వ్యవస్థ కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కేటాయించకపోవడం విడ్డూరమని గణేష్ అన్నారు.
సమీకృత గురుకులాల పేరుతో, ఇంటిగ్రేటెడ్ విద్య అని చెప్పి గురుకుల వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం చేస్తుందని.
భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అన్న సమయంలో పాఠశాలల మౌలిక వసతుల కొరకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడితే వాటికి నిధుల కేటాయింపులో అలసత్వం వహిస్తూ, ప్రభుత్వ బడి వ్యవస్థని నీరుగార్చే ప్రయత్నం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.
ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్స్ తిరిగి ఇవ్వడానికి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ,విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల నుండి సర్టిఫికెట్లను తిరిగి తీసుకోవడం కోసం బయట అప్పులు చేసి మరి ఫీజులు చెల్లించి సర్టిఫికెట్స్ తెచ్చుకుంటున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం , రేవంత్ గారి సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని దారమోని గణేష్ ఎద్దేవా చేశారు.
నిన్న రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యం గేట్లకు తాళాలు వేసి మరీ నిరసన తెలిపిన ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం ఏంటని గణేష్ ఆరోపించారు,వెంటనే విద్యా వ్యవస్థ పైన రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవితవ్యాన్ని వారి యొక్క భవిష్యత్తుని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి బిఆర్ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మరియు టిఆర్ఎస్ నాయకులు ఐల శేఖర్ గౌడ్, పేర కృష్ణ,అల్లుడు కృష్ణ,వర్కల పరుషరాములు, రమేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.