*మృతి చెందిన గుమస్తా కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన తోటి గుమస్తాలు*
*జమ్మికుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ అనే గుమస్తా గత నెల 3న అనారోగ్యంతో మృతి చెందాడు శుక్రవారం గుమస్తాల సంఘం అధ్యక్షులు పోశాల వెంకన్న ఆధ్వర్యంలో గుమస్తాలు అందరూ కలిసి అడ్తిదారుల సహాయంతో 53000 రూపాయలు కలెక్ట్ చేసి , మృతుడి కూతురైన అన్వితశ్రీ పేరుమీద సుకన్య యోజన పథకంలో పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తనతో పని చేసిన గుమస్తాకు అండగా తాము ఉన్నామని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతని అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్తిదారుల సంఘం నాయకుడు గుత్తి కుమార్, గుమస్తాల సంఘం నాయకుడు వీర్ల రమేష్, బుజ్జి గోపి, మహేష్ ,సురేష్ ,రమేష్ ,కొండాల్, చందు తదితరులు పాల్గొన్నారు.