వరి రకాల క్షేత్ర ప్రదర్శన

*కెవికె ఆధ్వర్యంలో వరి రకాల ప్రదర్శనపై క్షేత్ర దినోత్సవం*

*జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రైతులకు కె.వి.కె. క్షేత్రంలో సాగు చేస్తున్న అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) కు సంబంధించిన 20 వరి రకాల పని తీరుపైన క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు క్షేత్రంలో సాగు చేస్తున్న 20 వరి రకాల పంటకాలం లక్షణాల గురించి వివరించడం జరిగిందని తదుపరి పొలంలోకి దిగి వివిధ రకాల లక్షణాలు మొక్క ఎత్తు, పిలకల సంఖ్య, చీడ పీడలను తట్టుకునే శక్తి, ఒక గొలుసులో గల గింజల సంఖ్య వంటి లక్షణాలను ప్రయోగ పూర్వకంగా రికార్డ్ చేశారు.ఈ సమావేశంలో సేద్య విభాగ శాస్త్రవేత్త జె విజయ్,విస్తరణ విభాగ శాస్త్రవేత్త డా.ఎల్.మహేష్,ఐఆర్ఆర్ఐ ఫీల్డ్ కోఆర్డినేటర్ పి రాజేష్, రైతులు, అగ్రికల్చర్ & అగ్రి డిప్లొమా విద్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now