క్షేత్రస్థాయి పర్యటన
— జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జులై 01
కామారెడ్డి01,జులై 2025.
మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రమును సందర్శించినారు.
అంగన్వాడి కేంద్రమును సందర్శించి, చిన్నారులతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికహరం గురించి తెలుసుకొని, చిన్నారులకు గర్భిణీ స్త్రీ లకు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ రాజు, ఎంపీడీవో, తహసిల్దార్, MEO, మరియు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.