Site icon PRASHNA AYUDHAM

ఆర్థిక సాయం

WhatsApp Image 2025 01 12 at 8.10.42 PM

రూ.ఐదు వేల ఆర్థిక సాయం

నంగునూరు, 12 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అల్లూరి మల్లారెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.ఇట్టి విషయాన్ని స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ద్వారా మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. హరీశ్ రావు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కరెడ్ల లక్ష్మారెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లూరి విజయ్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు బాల్ రెడ్డి, భగవంత రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాధవ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, అనంతారం రఘుపతి, అనిల్ రెడ్డి, మన్నె బాబు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు అల్లూరి మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.తక్షణ సాయంగా ఐదు వేల రూపాయలు అందించారు.

Exit mobile version