Site icon PRASHNA AYUDHAM

గుండెపోటుతో మృతి చెందిన జూనియర్ న్యాయవాదికి బార్ అసోసియేషన్ నుండి ఆర్థిక సాయం

IMG 20251018 WA0027

గుండెపోటుతో మృతి చెందిన జూనియర్ న్యాయవాదికి బార్ అసోసియేషన్ నుండి ఆర్థిక సాయం

కామారెడ్డి బార్ అసోసియేషన్ మానవతా విలువలకు నిలువెత్తు ఉదాహరణ

గాంధారి మండలం న్యాయవాది సామల సుధీర్ కుమార్ గుండెపోటుతో మరణం.

కామారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున కుటుంబానికి ₹1 లక్ష ఆర్థిక సాయం.

అధ్యక్షుడు నందా రమేష్, కార్యదర్శి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం.

సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, వెంకటరామిరెడ్డి, రాజు, రాజశేఖర్, శరత్ పాల్గొన్నారు.

మానవతా విలువలకు కట్టుబడి ఉన్న బార్ అసోసియేషన్ సేవా స్పూర్తి ప్రశంసనీయం.

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 18:

గాంధారి మండల కేంద్రానికి చెందిన జూనియర్ న్యాయవాది సామల సుధీర్ కుమార్ అక్టోబర్ 14న గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కామారెడ్డి బార్ అసోసియేషన్ కుటుంబానికి ₹1 లక్ష ఆర్థిక సాయం అందజేసింది.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నందా రమేష్, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, వెంకటరామిరెడ్డి, రాజు, రాజశేఖర్, శరత్, అలాగే గాంధారి మాజీ ఎంపిటిసి తూర్పు రాజు హాజరయ్యారు.

న్యాయవాద సంఘం తరపున మాట్లాడుతూ అధ్యక్షుడు నందా రమేష్, “సుధీర్ కుమార్ యువ న్యాయవాది, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టసమయంలో సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. సభ్యుల సహకారంతో అందజేసిన ఈ సాయం బార్ అసోసియేషన్ మానవతా విలువలకు ప్రతీకగా నిలిచింది.

Exit mobile version