Site icon PRASHNA AYUDHAM

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద బీద కుటుంబాలకు రూ. 20,000 ఆర్థిక సాయం – జిల్లా కలెక్టర్ మను చౌదరి

IMG 20251014 WA0013

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద బీద కుటుంబాలకు రూ. 20,000 ఆర్థిక సాయం – జిల్లా కలెక్టర్ మను చౌదరి

దరఖాస్తులు మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14

కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్ వివరాల ప్రకారం, కుటుంబంలోని ప్రధాన జీవనాధారదారుడు (మహిళ లేదా పురుషుడు) మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి ఒకేసారి రూ. 20,000 నగదు సహాయం అందించబడుతుంది. ఈ సాయం జాతీయ సామాజిక భద్రతా పథకం లో భాగంగా ఇవ్వబడుతుందని ఆమె పేర్కొన్నారు.

పథకం అర్హతలు

కుటుంబ ప్రధాన జీవనాధారదారుడి వయస్సు 18 సంవత్సరాలు పైబడి, 60 సంవత్సరాల లోపు ఉన్న వారు మరణించినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు, పెళ్లి కాని కుమార్తెలు, ఆధారపడిన తల్లిదండ్రులు, మైనర్ సోదరులు లేదా సోదరీమణులు బాధిత కుటుంబంగా పరిగణించబడతారని ఆమె తెలిపారు.

అర్హులైన కుటుంబాలు

తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలే ఈ పథకానికి అర్హులు అవుతారని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. అదనంగా, క్రింది వర్గాల కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని వివరించారు –

వితంతువులు మరియు/లేదా మైనర్ పిల్లలతో ఉన్న కుటుంబాలు

ఎస్సీ / ఎస్టీ గృహాలు

మైనర్ పిల్లలు అనాథలుగా ఉన్న కుటుంబాలు

వైకల్యంతో ఉన్న పిల్లల కుటుంబాలు

ఒకే బిడ్డ ఆడపిల్లగా ఉన్న కుటుంబాలు

అన్ని మైనర్ పిల్లలు బాలికలే ఉన్న కుటుంబాలు

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు

మైనారిటీ మరియు బిసి / ఓసి వర్గాలకు చెందిన బీద కుటుంబాలు

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన కుటుంబాలు తమ పరిధిలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు తక్షణమే లబ్ధి పొందాలని ఆమె పిలుపునిచ్చారు.

Exit mobile version