మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
– ఇద్దరికీ రూ.1.5లక్షల చొప్పున 3లక్షలు అందించిన ఈసీఐఎల్ రన్నర్స్ అసోసియేషన్
*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం ):*
ఇటీవల జిల్లాలోని గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకట్ లు మరణించిన విషయం అందరికి విదితమే. హైదరాబాద్ కు చెందిన ఈసీఐఎల్ రన్నర్స్ అసోసియేషన్ వారు ఇరు కుటుంబాలను పరామర్శించి రూ.1.5 లక్షల చొప్పున ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబాలకు మన ధైర్యాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో పిల్లలు మంచిగా చదువుకోవాలని సూచించారు. పిల్లల చదువుల కోసం భవిష్యత్తులో మరింత సహాయం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.