ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 11 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఉద్యోగిని రజిని ఔదార్యం
తన తల్లి సరోజినీ జ్ఞాపకార్థం విద్యాభ్యాస పాఠశాలకు 50 కేజీల బియ్యం పంపిణీ,విద్యార్థులకు సహపంక్తి భోజనాలు, స్వీట్స్ అందజేత సింగరేణి కాలరీస్ సత్తుపల్లి జె.వి.ఆర్ (జలగం వెంగళరావు) ఓసి గనిలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దాసరి రజని తన మాతృమూర్తి సరోజిని జ్ఞాపకార్థం స్థానిక సంతోష్ నగర్ లోని విద్యాభ్యాస (బాల వెలుగు) పాఠశాలకు 50 కేజీల బియ్యాన్ని, విద్యార్థిని విద్యార్థులకు సహపంక్తి భోజనాలు, స్వీట్స్ అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా మాట్లాడుతూ ఎంతోమంది తమ కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో చనిపోయిన తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆమె సంవత్సరికం రోజున విద్యార్థుల చదువుకు సహకారం అందించాలని రజని సంకల్పాన్ని ఆయన అభినందించారు, దాతల ప్రోత్సాహంతో విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులు బి జగన్ మోహన్ రెడ్డి, పి కిరణ్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది వై సుహాసిని దేవి, సోడి స్వాతి, కొమరం చంద్రకళ వి రాధ, చీమల సుజాత తదితరులు పాల్గొన్నారు
సరోజినికీ ఆర్థిక సహాయం
