అంత్యక్రియలకు ఆర్ధికసాయం
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21: కూకట్పల్లి ప్రతినిధి
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 57లో నివసించే శ్రీనివాస్(53) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రదీప్ రెడ్డి, యాదగిరి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.