యువతిపై ఐదుగురు యువకుల దాడి.
నిజామాబాద్ జనవరి 17
నందిపేట్ మండలం కేంద్రంలో ని ఓ యువతిని ఐదుగురు యువకులు వెంటాడి, వేధించింది, దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ చిరంజీవి స్పందించి ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. డి సాయిరాం, బుర్ర విగ్నేష్, కరాడి సృజన్, సలి గంటి సాయికుమార్, కొండూరు రాహుల్ అనే యువకులు వేధింపులకు పాల్పడి, దాడి చేసినట్లు వెల్లడించారు. వీరంతా వన్నెల్ (కె) సిద్దాపూర్ గ్రామస్తులు అని తెలిపారు.