వామ్మో కృష్ణమ్మకు మళ్ళీ వరద..
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
కృష్ణానదికి మరోసారి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ముంచుకొచ్చింది. ప్రస్తుతం
శ్రీశైలం ప్రాజెక్టుకు 1. 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో
ఔట్ ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులుగా వుంది.
ప్రకాశం బ్యారేజీ నుంచి 77వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద వస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1.9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.90 అడుగులకు చేరింది.
మరోవైపు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,38,338 ఇన్ ఫ్లోను కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 31,204 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది.
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అయిదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వామ్మో కృష్ణమ్మకు మళ్లీ వరద..
by kana bai
Published On: October 21, 2024 1:09 am