ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి నవంబరు 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం( గోండు) నుండి విముక్తి కలిగించండి. నాయకపొడు కులాన్ని ప్రత్యేకంగా నామకరణం చేయండి అంటూ నాయకుడు రాష్ట్ర కమిటీ పసుల బుచ్చయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సమగ్ర ఇంటింటా సర్వే సామాజిక విద్య రాజకీయ,కుల సర్వేలో నయకపొడు గిరిజనలు గుర్తించాలని డిమాండ్ చేశారు. అన్ని సర్వేలతో పాటు నాయకపోడు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఈ క్రమసంఖ్యలో సూచించినట్లుగా 6 సామాజిక వర్గం రెండవ క్రమ సంఖ్య మూడవది 7లో కులం ఎస్ టి మూడవది 8లో ఉప కులం నాయక పోడుగా నమోదు చేయించాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసి గోవర్ధన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భోగి వీరస్వామి రాష్ట్ర సెక్రటరీ, సోమిని శివశంకర ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు, తాళ్ల దుర్గయ్య జిల్లా సెక్రెటరీ, గడ్డం వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటేష్, కాసిన నాగేందర్రావు,గుల్ల రాంబాబు, కొరసా వెంకటేష్ దొర, తదితరులు పాల్గొన్నారు.