Site icon PRASHNA AYUDHAM

ఆహారమే ఔషధం

IMG 20241016 WA0394

ఆహారమే ఔషధం

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్

ప్రశ్నాయుధం న్యూస్ ,అక్టోబర్ 16, కామారెడ్డి :

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర, అటవీ శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఆహారమే ఔషధమని పేర్కొన్నారు. ఆహారం యొక్క ప్రాధాన్యత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, నేటి సమాజంలో ప్రస్తుత కాలంలో ఆహారాన్ని వృధా చేయకుండా సరియైన రీతిలో వినియోగించుకోవాలని అన్నారు. అనారోగ్యం పాలవకుండా, మన పూర్వీకుల వలె సహజమైన ఆహారాన్ని ఫలాలను తీసుకోవడం మంచిదని తెలియజేశారు. ఉప్పు, చక్కెరల వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాలని సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉపన్యాసాలు, శ్రీమతి శ్రీ వల్లి అధ్యాపకురాలిచే పిపిటి ప్రదర్శన చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి. దినకర్, అధ్యాపకులు శ్రీలత, స్వాతి, వెన్నెల, రమణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version