ఏజెన్సీ ప్రాంతంతో కార్పొరేషన్ ఏర్పాటు సరికాదు

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి7
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి
ఏజెన్సీ ప్రాంతంతో కార్పొరేషన్ ఏర్పాటు గిరిజనుల హక్కులను హరించడమే అవుతుందన్నారు.
వినతులు విజ్ఞాపనల కాలం ముగిసింది, ఆందోళనలు చేపడతామన్నారు.
జిల్లా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం అని తెలియజేశారు.కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు చిట్టిరామవరం తండాలో మంగళవారం గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనను ఏజెన్సీ ప్రాంత గిరిజనులుగా తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పూర్తిగా మైదాన ప్రాంతం కాదన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా రామవరం ఏజెన్సీ ప్రాంతాన్ని విలీనం చేశారని అన్నారు. ఇందులో ప్రత్యేక భూభాగం పరిధిలో ఉన్న చిట్టిరామవరం తండా కలవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే మునిసిపల్ ఎన్నికలు నిలుపుదల చేయాలని గౌరవ హైకోర్టు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. నాటినుండి మునిసిపాలిటీలో విలీనమైన చిట్టిరామవరం ప్రాంతాన్ని తొలగించి ప్రత్యేక పంచాయతీ ఎన్నికలు జరపాలని దశలవారీగా ఉద్యమాలు చేయడం జరుగుతుందన్నారు. కానీ ఎన్నికల సమయంలో పాలకులు మా పార్టీని గెలిపిస్తే ప్రత్యేక పంచాయతీ చేయిస్తామంటూ నమ్మబలికి ఓట్లను కైవసం చేసుకుంటున్నారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారులేమో ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం కాబట్టి మేము ఏమి చేయలేమంటూ చేతులు దులుపుకుంటున్నారని అన్నారు.ఇన్నాళ్లు వినతులు విజ్ఞాపనలు చేశామని ఇకనుండి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాన్ని కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గిరిజనుల హక్కులను హరిచడమే అవుతుందని దుయ్యబట్టారు. న్యాయస్థానాల పైన తమకు నమ్మకం ఉందని, న్యాయపరంగా తప్పకుండా కార్పొరేషన్ ను లేదా కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటామని అన్నారు. ఇలాంటి వైఖరిని మానుకొని ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులు చిట్టిరామవరం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోను ఏ పార్టీని కూడా స్వాగతించమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ గోబ్రియా నాయక్, బీజేపీ నాయకులు రాంబాబు, సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, జేఏసీ నాయకులు పూర్ణచందర్, రాజ్ కుమార్, లచ్చిరాం, సక్రం, శ్రీను, కృష్ణ, నర్సింగ్, భూక్యా రవి, అపూర్, కలిస్, వీరేందర్, చింటూ, రవి, మురళి, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now