Site icon PRASHNA AYUDHAM

చిన మేరంగి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు

IMG 20250628 WA0006

చిన మేరంగి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 28 ( కృష్ణ యుద్ధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం మన్యం జిల్లా జి ఎం వలస మండలం చిన మేరంగి గ్రామంలో శుక్రవారం నాడు జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు చిన మేరంగి గ్రామంలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నుండి బలబద్ర సుభద్ర జగన్నాథ స్వామి విగ్రహాలను ఊరేగింపుగా మేళ తాళాలతో రథం పైకి తీసుకువచ్చారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు శత్రు చర్ల వంశీయులు మొదటి పూజ చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రత్యేక పూజలు చేశారు జులై ఒకటవ తేదీన హిరాపంచమి మహోత్సవం జరుగుతుందని ఐదవ తేదీన మారు రథయాత్ర జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి గిరిధర్ పాత్రో తెలిపారు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు

Exit mobile version