మాజీ సర్పంచును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
జుక్కల్ ఆర్సీ నవంబర్ 10 ప్రశ్న ఆయుధం
నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బేగరి రాజు గత నాలుగు రోజుల కిందట రోడ్డు ప్రమాదం జరిగి చికిత్సలు పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబీకులతో మాట్లాడి ఓదార్చారు. ఆయనతో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లింగాగౌడ్ కు సైతం తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుట ఉండడంతో ఆయన గురించి ఆరా తీశారు. దేవుడి దయవల్ల ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు దుర్గారెడ్డి అచ్చంపేటవిండో చైర్మన్ నరసింహారెడ్డి నాయకులు గైని విట్టల్,రమేష్ గౌడ్, యాటకారి నారాయణ, రమేష్, విజయ్, శ్రీకాంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి, పండరి నిజాంసాగర్ గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.