కీసరలో జీఎస్ఆర్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూలై 27
మేడ్చల్ నియోజకవర్గం, కీసర గ్రామ పరిధిలోని లేగసీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న జీఎస్ఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మరియు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు టాస్ వేసి మ్యాచ్ను ఉత్సాహంగా ప్రారంభించారు.
అనంతరం, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్తో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.