ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షులు మహీమూద్ ఖాన్, ఉపాధ్యక్షులు కరీం పాషా, సెక్రటరీ గౌస్ పాషా, అసెంబ్లీ ప్రెసిడెంట్ గౌస్ మొయినుద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ జానీ, వైస్ ప్రెసిడెంట్ అక్బర్, చుంచుపల్లి అధ్యక్షులు గోరెబాబు, బూర్గంపాడు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిన్నపాక నియోజకవర్గం కనితి కృష్ణ, ఫయాజ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.