లింగంపేట్ లో తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు 

లింగంపేట్ లో తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

తేదీ 18 జూన్ 2025 రోజున ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల అధ్యక్షులు భీమ్ రావు సమావేశానికి సీనియర్ నాయకులను ఆహ్వానించి వారికి సన్మానం తో పాటు పుష్పగుచ్చాo ఇవ్వడం జరిగింది. తదుపరి సీనియర్ నాయకులు భీమారావుని శాలువతో సన్మానించి పుష్పగుచ్చoఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ముందుకు వెళ్తుందని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో లింగంపేట్ మండల అధ్యక్షులు భీమ్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిశీలకులు దేమే కమ్మరి రాజు, నాగిరెడ్డిపేట్ ఎక్స్ జెడ్పిటిసి జయరాజ్, లింగంపేట్ మండల జిల్లా సీనియర్ నాయకులు అవుసుల లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు విశ్వేశ్వర్ పంతులు, సీనియర్ నాయకులు జగ్గా నాయక్,  నన్నే నాయక్, కమ్మరి కృష్ణ, తిరుమల కిషన్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment