వివాహేతర సంబంధం నాలుగు ప్రాణాలను బలి తీసుకుంది
దిండుక్కల్ (తమిళనాడు):
ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడం నలుగురి మృతికి దారి తీసింది. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా ఓట్టన్సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు —
చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్ర (27) అనే మహిళకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లి, ఇటీవల తల్లి కాళీశ్వరి (47), తన కుమార్తెలు లిథిక్సా (8), దీపికా (5)లతో కలిసి ఉండేది.
జూన్ 17న పవిత్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత తిరిగి రాలేదు. అనంతరం ఆమె ఒక వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని తెలిసి కుటుంబంలో తీవ్ర మనోవేదన నెలకొంది.
ఆత్మగౌరవం దెబ్బతిన్న కాళీశ్వరి, ఆమె తల్లి చెల్లమ్మాల్ (65), తీవ్ర మనస్తాపంతో ఇద్దరు చిన్నారులను ఉరితీయగా, అనంతరం వారిద్దరూ కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచారు.
పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పవిత్ర గల్లంతయిన విషయంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.