Site icon PRASHNA AYUDHAM

సంగారెడ్డి ఆర్టీసీ కాలనీలో ఉచిత హోమియో వైద్య శిబిరం

IMG 20250624 195937

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి 9వ వార్డు ఆర్టీసీ కాలనీలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెం ఆర్టీసీ కాలనీలో శ్రీరామ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ హోమియోపతి హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక కాలనీ వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ లాడే మల్లేశం పాల్గొని శ్రీరామ అసోసియేషన్ సభ్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం, రాజేశ్వర్ స్వామి మాట్లాడుతూ.. హోమియో పతి ద్వారా ఇంగ్లీష్ మందులకు స్వస్తి పలుకుతూ.. ఇంటింటా ఆరోగ్యమే మహాభాగ్యంగా విలసీల్లాలనే తపనతో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ వల్ల సౌజన్యంతో ప్రతి మoగళవారం శ్రీ రామ అసోసియేషన్ షెడ్డులో నిర్వహించే ఉచిత పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ కాలనీ, గొల్ల గూడెం, గణేష్ నగర్, సాయినగర్, సండేమార్కెట్ కాలనీ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సురేష్ గౌడ్, యాదయ్య, రాములు, అనీల్, సంగమేశ్వర్, ప్రభు, సత్యనారాయణతో పాటు ఇతర సభ్యులు, ఆర్టీసీ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Exit mobile version